నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 15: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శనివారం జూరాల ప్రాజెక్టుకు 2.67 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా, 43 గేట్లు తెరిచి నీటిని వదులుతున్నా రు. అవుట్ఫ్లో 2,70,572 క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో 4,02,746 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 4,42,803 క్యూసెక్కులు నమోదైంది. శ్రీశై లం రిజర్వాయర్ నుంచి 4,42,755 క్యూసెక్కుల ఇన్ఫ్లో నాగార్జునసాగర్ రిజర్వాయర్కు కొనసాగుతుండటంతో 22 క్రస్ట్ గేట్ల ద్వారా 3,94,798 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎస్సారెస్పీలోకి 1,36, 118 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. 22 గేట్లను ఎత్తి 1,17,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 22 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. సింగూర్ ప్రాజెక్టులోకి 32,892 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నది.