హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వేసవి ఎండలు క్రమంగా పెరుగుతుంటే మరోవైపు తాగునీరు అందక పలు గ్రామాలు అల్లాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,760 గ్రామ పంచాయతీల్లో మంగళవారం నాటికి 176 గ్రామాలకు తాగునీరు అందడం లేదు. వివిధ ప్రాంతాల్లో 661 బోర్లు, 620 చేతిపంపులు పనిచేయడం లేదు. 64 గ్రామాల్లో మంగళవారం తాగునీరు క్లోరినేషన్ కాలేదని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 10,608 గ్రామాల తాగునీటి సరఫరా డాటాను ఆన్లైన్లో నమోదు చేశారు. వీటిలో 10,432 గ్రామాలకు సమృద్ధిగా తాగునీరు అందుతున్నదని, తాతాలిక సమస్యల కారణంగా 176 గ్రామాలకు నీళ్లు అందడం లేదని పేర్కొన్నారు. మంత్రి సీతక ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ‘సమ్మర్ స్పెషల్ ఇంటెన్సివ్ డ్రైవ్’ ప్రారంభమైందని, ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ డ్రైవ్ కొనసాగుతున్నదని తెలిపారు.
రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిపై రోజువారీగా సమీక్షిస్తున్నట్టు మంత్రి సీతక్క మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలవారీగా ఎన్ని గ్రామాలకు తాగునీరు సమృద్ధిగా అందుతున్నది? తాతాలిక సమస్యలతో ఎన్ని గ్రామలకు నీళ్లు అండడం లేదు? వాటిని ఎన్ని రోజుల్లో పరిషరించవచ్చు? అనే అంశాలపై రోజు నివేదికలు తెప్పించుకుని, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇస్తున్నట్టు వివరించారు.