హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చెరువులు, కుంటలు, జలవనరులను పరిరక్షించేందుకు వాటర్ కమిషన్ను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఇరిగేషన్శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్, పీపుల్స్ మానిటరింగ్ గ్రూప్ ఆన్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్, సిటీజన్ కన్స్యూమర్ అండ్ సివిక్ యాక్షన్ గ్రూప్లు సంయుక్తంగా ‘ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఇన్ ఇండియా ఫోకస్ ఆన్ తెలంగాణ’ అంశంపై బేగంపేట హోటల్ హరిత ప్లాజాలో నిర్వహించిన మీడియా వర్క్షాప్లో ఉత్తమ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ.. నిపుణులు, మేధావులు రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ కోసం ఓ ప్రణాళికను రూపొందించి అందజేస్తే అమలుచేస్తామని తెలిపారు. ధరిత్రిని రక్షిం చుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. సమావేశంలో పర్యావరణవేత్త, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, డీ నర్సింహారెడ్డి, రీచా మిశ్రా, ఎం వేణుగోపాల్రావు, హైదరాబాద్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు రవికాంత్రెడ్డి, సీనియర్ జర్నలిస్టు దిలీప్రెడ్డి పాల్గొన్నారు.