కరీంనగర్ : ప్రజలు ఆరోగ్యానికి హానిచేసే ఆహార పదార్థాల జోలికి వెళ్లకూడదని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వైద్యుడు కోరారు. జనం ఎంత చెప్పినా తమ అనారోగ్యకర ఆహరపు అలవాట్లను మార్చుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఇప్పటికైనా నా మాట వినండి. రిఫైన్డ్ ఆయిల్, చక్కెర జోలికి వెళ్లకండి. వాటివల్ల క్యాన్సర్ సహా పలు ప్రాణాంతక వ్యాధుల బారినపడాల్సి వస్తుంది’ అని తన దగ్గరికి వచ్చిన రోగులను భావోద్వేగంతో ఆయన వేడుకున్నాడు. ఈ సందేశానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
రిఫైన్డ్ ఆయిల్, చక్కెర లాంటివి తిని ఆరోగ్యాలను పాడుచేసుకోవద్దని ఆ వీడియోలో వైద్యుడు వేడుకున్నారు. గానుగ నూనెను మాత్రమే వాడాలని సూచించారు. పిల్లలను మనం ఎంతో ప్రేమగా పెంచుకుంటామని, వాళ్లకు కూడా ఆరోగ్యాలను చెగగొట్టే చిప్స్, చాక్లెట్స్ లాంటివి తినిపించకూడదని చెప్పారు. బయటి ఆహార పదార్థాలను తినకూడదని, అవి ఆరోగ్యాలను పాడుచేస్తాయని అన్నారు. ఇంట్లోని వంటచేసుకుని తినాలని సూచించారు. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు వైద్యుడి ఆవేదన చూసి ఫిదా అయ్యారు. డాక్టర్ అంటే ఇలా వుండాలని ప్రశంసిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కరీంనగర్ వైద్యుడి భావోగ్వేద సందేశం 🥺
దయచేసి రిఫైండ్ ఆయిల్, చెక్కర వాడకండి వాటి వాడకం వలన కాన్సర్ సహా పలు ఆరోగ్య సమస్యలు వస్తాయ్ అనీ తన దగ్గరికి వచ్చిన పేటెంట్స్ కి చెప్పుతూ భావోద్వేగనీకీ లోనైన వైద్యుడు.
వైద్యుడి వీడియో సందేశం చూసి డాక్టర్ అంటే ఇలా… pic.twitter.com/IGHzbBYDp6
— TRPartyOfficial (@TRPartyOfficial) March 31, 2026