హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): వరంగల్ నగరానికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తించిన అభ్యాసన నగరాల ప్రపంచ నెట్వర్క్లో వరంగల్కు చోటు లభించింది. ఇప్పటికే వరంగల్లోని ప్రఖ్యాత రామప్ప ఆలయానికి వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపునిచ్చిన సంగతి తెలిసిందే. ఏడాది వ్యవధిలోనే వరంగల్కు యునెస్కో నుంచి రెండుమార్లు గుర్తింపు లభించడం విశేషం.గ్లోబల్ నెట్వర్క్ ఆఫ లెర్నింగ్ సిటీస్లో వరంగల్కు చోటు లభించడం పట్ల పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన వరంగల్ నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గుర్తింపు రావడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు, మంత్రి కేటీఆర్కు, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.