Warangal | వరంగల్ : చారిత్రక భద్రకాళీ ఆలయంలో శాకాంబరి నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. తొలిరోజు కామేశ్వరి అలంకరణలో భద్రకాళీ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాలకు ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు. కార్యక్రమంలో కొమురవెల్లి దేవస్థాన ఆస్థాన వేదపడింతులు వేలేటి సిద్దరామశర్మ, ఆలయ సామవేద పండితులు ప్రదీప్కుమార్ శర్మ, ముఖ్య అర్చకులు నర్సింహశర్మ, వెంకట నాగరాజశర్మ, ఆలయ సూపరింటెండెంట్ అద్దంకి విజయ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.