హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): అంతర్రాష్ట్ర జల వివాదాలపై పిటిషన్లపై రోస్టర్ విధానం ప్రకారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) నేతృత్వంలోని ధర్మాసనమే విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి హైకోర్టును కోరింది. తెలంగాణ చేపట్టిన జలవిద్యుత్తు ఉత్పత్తిని వ్యతిరేకిస్తూ ఏపీ రైతులు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు, జస్టిస్ టీ వినోద్కుమార్తో కూడిన ధర్మాసనం విచారించరాదని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కో రారు. ఈ పిటిషన్పై మంగళవారం ధర్మాసనం విచారణ చేపట్టగానే ఏజీ అభ్యంతరం తెలిపారు. తమ వాదనను సీజేకు తెలిపామని చెప్పారు. దాంతో సీజేను సంప్రదించిన తర్వాతే పిటిషన్పై విచారణ చేపడుతామని ధర్మాసనం పేర్కొంది.
ప్రధాన న్యాయమూర్తికి విన్నపం
నదీ జలాల వివాదాలను సీజే ధర్మాసనమే విచారించాల్సి ఉంటుందని సీజే జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డితో కూడిన ధర్మాసనానికి ఏజీ తెలిపారు. జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణను తా త్కాలికంగా నిలిపేసిన తర్వాత సీజే ముందు ఏజీ ఈ అం శాన్ని లేవనెత్తారు. దాంతో ఈ మొత్తం వ్యవహారంపై సీజే హిమాకోహ్లీ అసహనం వ్యక్తంచేశారు. ఏజీతోపాటు ఏపీ రైతుల తరఫు న్యాయవాది వెంకటరమణ తీరును తప్పుపట్టింది. వ్యాజ్యాన్ని ఫలానా బెంచ్ విచారించాలని కోరడం అభ్యంతరకరమని వ్యాఖ్యానించింది. దాంతో విచారణ నుంచి ఎమ్మెస్ రామచంద్రరావు తప్పుకోవాలని దాఖలుచేసిన మధ్యంతర పిటిషన్ను వాపస్ తీసుకొంటామని ఏజీ తెలిపారు. ఆ తర్వాత జీవో 34ను సవాల్ చేసిన రిట్ పిటిషన్ ఫైల్ను రిజిస్ట్రీ నుంచి తెప్పించుకొని తాము తగిన నిర్ణ యం తీసుకుంటామని సీజే ధర్మాసనం వెల్లడించింది. ఎ ప్పుడు, ఏ డివిజన్ బెంచ్ విచారణ చేసేదీ తెలియజేస్తామని, ఈలోగా దీనిని వివాదం చేయకుండా ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోరింది.
పిటిషనర్ల న్యాయవాదిపై ఆగ్రహం
విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వేదుల వెంకటరమణపై సీజే ధర్మాసనం ఆగ్రహం వ్యక్తచేసింది. రిజిస్ట్రీకి దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని మండిపడిం ది. రిట్పై అత్యవసరంగా (హౌస్మోషన్) విచారణ చేపట్టాలని కోరితే సాంకేతిక కారణాలతో వెనక్కి ఇచ్చారని, సోమవారం మళ్లీ పిటిషన్ వేశామని పిటిషనర్ తరఫు న్యాయవా ది తెలిపారు. హైకోర్టు రిజిస్ట్రీ సమాచారం మేరకు పిటిషన్ను జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించినట్టు తెలిపారు. దీనిపై సీజే ధర్మాసనం కల్పించుకొని అంతర్ రాష్ట్ర వివాదాలు, ప్రాజెక్టులకు సం బంధించిన కేసులు మొదటి కోర్టు విచారణ చేస్తుంటే రెండో కోర్టులో ఎలా ప్రస్తావిస్తారని నిలదీసింది. హైకోర్టు రిజిస్ట్రీ చెప్పిందని నింద మోపవద్దని సూచించింది.