హైదరాబాద్ : వనపర్తి, సంగారెడ్డి మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. ఈ రెండు కాలేజీల్లో తరగతుల నిర్వహణకు అనుమతులిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వనపర్తి, సంగారెడ్డి మెడికల్ కాలేజీల భవనాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి.
వనపర్తి మెడికల్ కాలేజీలో 150 సీట్లతో 2022 – 2023 విద్యా సంవత్సరానికి తరగతుల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. మెడికల్ కళాశాల నిర్మాణానికి ఇప్పటికే 50 ఎకరాల స్థలం కేటాయింపు చేసింది. రూ.510 కోట్లతో మెడికల్ కళాశాల భవనం, పరిపాలనా భవనం, విద్యార్థుల, సిబ్బంది వసతి గృహాల నిర్మాణం చేపట్టారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు వనపర్తికి మెడికల్ కళాశాల మంజూరైన సంగతి తెలిసిందే. వనపర్తి మెడికల్ కళాశాలకు జాతీయ ఆరోగ్య కమీషన్ అనుమతి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావుకు వనపర్తి జిల్లా ప్రజల తరపున రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.