వనపర్తి టౌన్, జనవరి 19 : అంతరించిపోతున్న మొక్కను కనుగొన్నాడు వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన భరత్సింహ యాదవ్. ఈయన తమిళనాడులోని మధురైలో ఉన్న మధుర కళాశాలలో ప్రొఫెసర్ కరుప్పుస్వామి ఆధ్వర్యంలో వృక్షశాస్త్రంలో పరిశోధనలు చేస్తున్నారు. దేశంలోని పశ్చిమ కనుమల్లో అంతరించిపోతున్న మొక్కల జీవిత చిత్రం అనే అంశంపై పరిశోధనలు సాగిస్తున్నారు. అందులో భాగంగానే తమిళనాడులోని తేని జిల్లాలో ఓ కొత్త మొక్కను కనుగొన్నారు. ఈ మొక్కకు ‘ఆండ్రోగ్రాఫిస్ థేనియెన్సిస్’ అని నామకరణం చేశారు. ఈ రకమైన జాతి మొక్కలు బంగ్లాదేశ్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, పశ్చిమ హిమాలయాల్లో విస్తరించి ఉంటాయి.