హైదరాబాద్, మార్చి 19(నమస్తే తెలంగాణ): రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఏప్రిల్ 2న శ్రీకల్పతరు సంస్థాన్ ‘వృక్ష మిత్ర సమ్మాన్ సమారోహ్’ కార్యక్రమానికి ఎంపీ, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్కుమార్కు ఆహ్వానం అందింది. దీనికి హర్షిస్తూ ‘నన్ను ఆహ్వానించినందుకు ఆనందంగా ఉంది. ట్రీమ్యాన్ ఆఫ్ ఇండియా విష్ణులాంబా జీకి ధన్యవాదాలు. అక్కడికి వచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మాతృభూమిని మరింత అందంగా తీర్చిదిద్దాలని కృషిచేస్తున్న చాలామందిని కలుసుకునేందుకు ఇది గొప్ప అవకాశం.” అంటూ ఎంపి ట్వీట్ చేశారు.