హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): టీచర్స్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగుస్తుండటంతో ఎన్నికల నిర్వహణకు ఈసీ కసరత్తు మొదలు పెట్టింది. మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కాటేపల్లి జనార్దన్రెడ్డి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పదవీకాలం ముగిసేలోగా కొత్త అభ్యర్థి ఎన్నికను పూర్తి చేయా ల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఎన్నికల కమిషన్ ఈ టీచర్స్ నియోజకవర్గానికి ఓటర్ల జాబితాను తయారు చేయడానికి సిద్ధమైంది.
శనివారం నుంచి ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఓటర్ల తుది జాబితాను వెల్లడిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ టీచర్స్ నియోజకవర్గంతోపాటు టీచర్స్ ఎమ్మెల్సీకి ఓటర్ల నమోదు మహారాష్ట్రలో రెండు టీచర్స్, మూడు గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలకు, ఉత్తరప్రదేశ్లో మూడు గ్రాడ్యుయేట్స్, రెండు టీచర్స్, ఏపీలో మూడు గ్రాడ్యుయేట్స్, రెండు టీచర్స్, బీహార్లో రెండు గ్రాడ్యుయేట్స్, రెండు టీచర్స్ నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది.