హైదరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ ఓటర్ల జాబితా సవరణను చేపట్టడానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఓటర్ల జాబితా సవరణ చేపట్టలేదు. 2022 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన నియోజకవర్గంలోని వారందరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. డిసెంబర్ 6 వరకు కల్లా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ శనివారం షెడ్యూల్ను విడుదల చేశారు.
దీని కోసం ఈనెల 7, 27, 28 తేదీల్లో ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించి తుది జాబితాను జనవరి 5న ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.