PNS Ghazi | హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ఇండియా-పాకిస్థాన్ మధ్య 1972లో జరిగిన యుద్ధంలో మునిగిపోయిన పాక్ జలాంతర్గామి ఘాజీ శకలాలను ఇండియన్ నేవీ గుర్తించింది. విశాఖపట్నం డీప్ సబ్మెరైన్స్ రెస్క్యూ వెహికల్.. ఈ శిథిలాలు కనుగొంది.
విశాఖ తీరానికి 2.5 కి.మీ దూరంలో 100 మీటర్ల లోతులో ఈ శకలాలను గుర్తించారు. 1972 యుద్ధంలో బంగాళాఖాతంలోకి అక్రమంగా చొరబడిన ఘాజీ జలాంతర్గామి మునిగిపోవడంతో అందులోని 93 మంది మరణించారు.