కందుకూరు, ఫిబ్రవరి 28: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని కేంద్ర, లండన్ బృందాలు కితాబిచ్చాయి. వాష్ ప్రోగ్రాంలో భాగంగా మంగళవారం సీఈఈసీ, యూనిసెఫ్, ఎస్ఎస్ఏ బృందాలు మంగళవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని సాయిరెడ్డిగూడ ప్రభుత్వ పాఠశాలను సందర్శించాయి. పాఠశాలలో మంచినీరు, పరిశుభ్రత, మూత్రశాలలు, మధ్యాహ్న భోజనం పేరెంట్స్ కమిటీ, చైల్డ్ కమిటీ పనితీరు, స్వచ్ఛత తదితర అంశాలను పరిశీలించాయి.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సలహాలు, సూచనలు చేశాయి. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుశీందర్రావు, యూనిసెఫ్, యూయూకే ప్రతినిధులు వెంకటేశ్, ప్రతాప్, డాక్టర్ వెంకటేశం, సీఈసీ బెంగళూరు నుంచి రీజినల్ కోఆర్డినేటర్ ఉదయ, ఏపీ నుంచి ప్రాజెక్టు కో ఆర్డినేటర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.