జగిత్యాల: జిల్లాలోని ప్రముఖ ఆయలం కొండగట్టు క్షేత్రాన్ని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి సందర్శించారు. ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండగట్టు క్షేత్ర మహాత్మ్యాన్ని ఆలయ పండితులు స్వామీజీకి వివరించారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాత్మానందేంద్ర స్వామికి స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామీజీ మాట్లాడుతూ.. మాస్కులు లేని ప్రపంచాన్ని అందివ్వాలని ఆంజనేయస్వామిని ప్రార్ధించినట్లు తెలిపారు. తెలంగాణలో ఉన్న ఆలయాల్లో కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రానికి ప్రత్యేకత ఉందన్నారు.
కొండగట్టు ఆంజనేయస్వామి అనుగ్రహంతో అనారోగ్యం నుంచి విముక్తి పొందిన వారెందరో ఉన్నారని, గొప్ప మహిమాన్వితుడుగా పూజలందుకుంటున్నాడని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని భావించడం శుభ పరిణామమని తెలిపారు.