కామారెడ్డి : జిల్లాలోని కామారెడ్డి నియోజికవర్గంలో 39 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుంచి మంజూరైన 19 లక్షల 80 వేల 500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ప్రయోజనకరంగా మారిందన్నారు.
సీఎం కేసీఆర్ నిరుపేదలకు అండగా ఉంటుందన్నారు. సీఎంఆర్ఎఫ్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.