చెన్నూర్ రూరల్, మార్చి 23: మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని పద్మానగర్లోగల గుడిసె కాలనీకి చెందిన పలువురు మహిళలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైనట్టు చెన్నూర్ సీఐ రవీందర్ తెలిపారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట మహిళలు నీటి కోసం ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. ఎఫ్ఎస్టీ టీం ఫిర్యాదు మేరకు మద్దెల భదాణి, శిరీష, ప్రసన్న, పద్మ, సుజాత, రుక్మిణి, మౌలిక, ప్రియాంక, రేవతితోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్టు సీఐ రవీందర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించాలని, ఎవరైనా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.