హైదరాబాద్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షడు బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాదారణ కలిగిన గొప్ప నాయకుడు సాయిరెడ్డి అన్నారు. నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడ్డ నేత అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి సాయిరెడ్డి అని గుర్తు చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కరోనాతో జూనియర్ అసిస్టెంట్ మృతి
కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
కేటీఆర్ త్వరగా కోలుకోవాలి : మంత్రి ఐకే రెడ్డి
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని లక్ష పుష్పార్చన