హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అటవీశాఖలో సీనియర్ అధికారిగా ఉన్న డాక్టర్ వినయ్కుమార్ ఉన్నత పదవిలో నియామకమయ్యారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్-ఎడ్యుకేషన్ డైరెక్టర్గా (ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్) వినయ్కుమార్ నియమితులయ్యారు.
ఈయన ప్రస్తుతం తెలంగాణ అటవీశాఖలో అదనపు పీసీసీఎఫ్ హోదాలో ఐటీ, వర్కింగ్ ప్లాన్ బాధ్యతల్లో ఉన్నారు. కొత్త పోస్టులో ఫారెస్ట్ రీసెర్చ్, ఎడ్యుకేషన్పై అంతర్జాతీయ సంబంధాలను సమన్వయం చేయనున్నారు. ఐదేండ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. వివిధ దేశాలకు చెందిన సంస్థల అటవీ అధ్యయనం, పరిశోధనలు, పర్యావరణ మార్పులపై నిర్వహించే సదస్సులను వినయ్కుమార్ పర్యవేక్షిస్తారు.