కరీంనగర్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ జనం టీఆర్ఎస్కు జైకొడుతున్నారు. పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్కు మద్దతుగా పల్లెలు కదులుతున్నాయి. పలు సంఘాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి టీఆర్ఎస్కు ఓటేస్తామంటున్నాయి. ఇప్పటికే హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల్లోని అనేక గ్రామాలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి, ‘గెల్లు గెలుపు బాధ్యతమాది.. ప్రగతి బాధ్యత మీది’.. అని స్పష్టంచేశాయి. బుధవారం జమ్మికుంట మండలం మాచనపల్లి, హుజూరాబాద్ మండలం రాంపూర్, పోతిరెడ్డిపేట గ్రామాలకు చెందిన ప్రజలు పెద్దసంఖ్యలో మంత్రి హరీశ్రావును కలిసి మద్దతు ప్రకటించారు. ‘కారు గుర్తుకే మా ఓటు’ అని చెప్పారు. హుజూరాబాద్ అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులు సింగాపూర్ గెస్ట్హౌస్లో మంత్రి హరీశ్రావును కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గెల్లు శ్రీనివాస్కు ఓటు వేస్తామని జమ్మికుంటలో సామిల్, టింబర్ అసోసియేషన్ నాయకులు ఏకగ్రీవ తీర్మానంచేశారు. తీర్మాన పత్రాన్ని పట్టణంలోని సిటీసెంటర్హాల్లో మంత్రి గంగుల కమలాకర్కు అందజేశారు.