హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని ప్రకటించింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు రాజమహేంద్రవరం స్టేషన్ సమీపంలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో ఒకే ట్రాక్పై రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోల్కతా-చెన్నై రహదారిలో రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ట్రాక్పై హుటాహుటిన మరమ్ములు చేస్తున్నారు.
కాగా, గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో దక్షిణమధ్య రైల్వే తొమ్మి రైళ్లను రద్దు చేసింది. మరో రెండు రైళ్లను పాక్షికంగా రద్దుచేసింది. విజయవాడ-లింగంపల్లి రైలు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తుందని అధికారులు తెలిపారు. విజయవాడ-విశాఖపట్నం, విశాఖ-విజయవాడ, గుంటూరు-విశాఖ, విశాఖ-గుంటూరు, విజయవాడ-గుంటూరు, గుంటూరు-విజయవాడ రైళ్లను రద్దుచేసినట్లు చెప్పారు.