హైదరాబాద్ : తెలంగాణ విజయ డెయిరీ పాల ఉత్పత్తుల అమ్మకాల టర్నోవర్ను రాబోయే 3 సంవత్సరాలలో రూ.1500 కోట్ల లక్ష్యాన్ని సాధించే విధంగా సమగ్ర కార్యాచరణనురూపొందించాలని పశుసంవర్ధక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో తెలంగాణ విజయ డెయిరీ ఉత్పత్తుల మార్కెటింగ్, నూతన ఔట్ లెట్ల ఏర్పాటు, ఇతర కార్యక్రమాల పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష లో డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి, ఇంచార్జి డెయిరీ ఎండీ అనిత రాజేంద్ర, డెయిరీ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో నిరాధరణకు గురైన విజయ డెయిరీ సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో అత్యధిక పాలను సేకరించి వినియోగదారులకు నాణ్యమైన పాలను, పాల ఉత్పత్తులను అందిస్తున్నదని తెలిపారు. ఎంతో ప్రజాధరణ కలిగి అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో ఉత్పత్తి చేయబడుతున్న విజయ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకెళ్లే విధంగా ఉన్నతస్థాయి మార్కెటింగ్, విస్తృత ప్రచారం పాలసీ ని రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఈ క్రమంలో ప్రప్రధమంగా ప్రస్తుతం ఉన్న ఔట్ లెట్ లకు అదనంగా మరిన్ని నూతన ఔట్ లెట్స్ ఏర్పాటు చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేసి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం విజయ డెయిరీ ద్వారా పాలు, పెరుగు, లస్సీ, దూద్ పేడ, బాదం పాలు, నెయ్యి తో పాటు టెట్రా ప్యాక్, మలాయ్ లడ్డు, రాగి లడ్డు, మిల్లెట్ లడ్డు వంటి సుమారు 33 రకాల ఉత్పత్తులను ఔట్ లెట్ ల ద్వారా విక్రయిస్తున్నట్లు వివరించారు.
సహకార రంగంలో పనిచేస్తూ లాభాపేక్ష లేకుండా కేవలం పాడిరంగం పై ఆధారపడి ఉన్న రైతుల అభివృద్దికి కృషి చేస్తూ తద్వారా ప్రజలకు నాణ్యమైన పాలన అందిస్తూ దినదినాభివృద్ధి చెందుతున్న విజయ డెయిరీ మార్కెట్ అవసరాలను, పోటీరంగంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రతి వినియోగదారుడికి చేరువయ్యే విధంగా చూడాలని సూచించారు.
నేషనల్ హై వే అథారిటీ వారితో కుదిరిన ఒప్పందం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని ఇందల్ వాయ్, పంతంగి, కొర్లపహాడ్, పిప్పల పహాడ్, గూడూరు, గంజాల్ టోల్ గేట్ ల వద్ద విజయ తెలంగాణ పార్లర్ లను ఏర్పాటు చేశామన్నారు. రానున్న రోజులలో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సమగ్ర నివేదికలను రూపొందించి వచ్చే నెల 16 వ తేదీన నిర్వహించే బోర్డ్ సమావేశంలో సమర్పించాలని ఆదేశించారు.
బ్రిడ్జి వంటి అన్ని ప్రధాన ప్రాంతాలలో విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాల ఏర్పాటు ను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సహకారం, ఉద్యోగులు, సిబ్బంది కృషి ఫలితంగా నష్టాలలో ఉన్న విజయ డెయిరీ లాభాల బాట పట్టిందని, మరింత లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు ఉద్యోగులు, సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు.