హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): జాతీయ ఆహార భద్రత చట్టం అమలును ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు రాష్ట్రస్థాయిలో విజిలెన్స్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి చైర్మన్గా, పౌరసరఫరాశాఖ కమిషనర్ వైస్ చైర్మన్గా ఉండే ఈ కమిటీలో మరో 15 మంది సభ్యులు ఉంటారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి వీ అనిల్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏటా జనవరి, జులైలో సమావేశం కావాలని పేర్కొన్నారు. కమిటీలో వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమం, విద్య, బీసీ సంక్షేమం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం, తూనికలు-కొలతలు, పౌరసరఫరాలు, తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్ కార్యదర్శులతోపాటు తెలంగాణ ఆయిల్ ఇండస్ట్రీ కో-ఆర్డినేటర్, రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర వినియోగదారుల సంఘం ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి జాతీయ ఆహార భద్రత చట్టం, పౌరసరఫరాలశాఖ డిప్యూటీ కమిషనర్ కన్వీనర్గా వ్యవహరించనున్నారు.