హైదరాబాద్, ఆగస్టు 30(నమస్తే తెలంగా ణ): ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివా స్ రచించిన విఘ్నరాజం భజే గ్రంథానికి నమస్కరిస్తే సాక్షాత్తూ గణపతికి నమస్కరించినట్టేనని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి పేర్కొన్నారు. రవీంద్రభారతిలో తెలంగాణ సాంస్కృతికశాఖ నిర్వహించిన కార్యక్రమంలో విఘ్నరాజం భజే గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీ మురళీమోహన్, వంశీ రామరాజు, పొత్తూరి సుబ్బారావు, దైవజ్ఞశర్మ పాల్గొన్నారు.