హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా విద్యాసాగర్ ఖమ్మం చీఫ్ ఇంజినీర్గా నియమితులయ్యారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఖమ్మం సీఈగా ఉన్న శంకర్నాయక్ను ఇరిగేషన్ శాఖ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేసింది.
సాగునీటి పారుదల శాఖ సీఈలు మధుసూదన్, ఐ రమేశ్, కే రమేశ్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం చేసుకున్న దరఖాస్తులను ప్రభుత్వం ఆమోదించింది.