హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఎంతో గొప్ప కార్యక్రమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీమణి ఉషా, కూతురు దీపావెంకట్ ప్రశంసించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మంగళవారం బెంగళూరు దేవనహళ్లిలోని సదహళ్లి గేట్ వద్ద మొక్కలు నాటారు. స్వర్ణ భారతి ట్రస్టు ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో మొక్కలునాటే కార్యక్రమం చేపడుతామని దీపావెంకట్ ప్రకటించారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి సుధీర్ వారికి వృక్షవేదం పుస్తకాన్ని బహూకరించారు.