హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ వృద్ధ నాయకుడు వీ హన్మంతరావు విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు యశ్వంత్ సిన్హాను కలవకూడదని టీపీసీసీ నిర్ణయించింది. అధిష్ఠానం ఆదేశాలను పక్కనబెట్టిన హన్మంతరావు నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని యశ్వంత్కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. హన్మంతరావు ఇలా యశ్వంత్సిన్హాను కలవడం కాంగ్రెస్ సహా అన్ని పార్టీల్లో చర్చనీయాంశమైంది.