హైదరాబాద్, ఆగస్టు 11, (నమస్తే తెలంగాణ) : రుణ ఉపశమన కమిషన్ చైర్మన్గా నాగుర్ల వెంకటేశ్వర్లును మరోసారి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేండ్లపాటు నాగుర్ల వెంకటేశ్వర్లు ఈ పదవిలో ఉంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
గతంలోనూ ఇదే పదవిలో నాగుర్ల కొనసాగారు. తన నియామకంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆయన కృతృజ్ఞతలు తెలిపారు.