వేములవాడ : రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో తలనీలాల టెండర్ రికార్డు స్థాయిలో పలికింది. గత యేడాది కంటే వచ్చే రెండు సంత్సరాలకు రెట్టింపు ధర పలికింది. 2023 నుంచి 2025 వరకు ఆలయంలో తలనీలాలు సేకరించేందుకు అధికారులు టెండర్లను ఆహ్వానించారు.
వేలం పాటలో 11 మంది కాంట్రాక్టర్లు పాల్గొనగా సీలు టెండర్ల ద్వారా మరో ఏడుగురు పోటీ పడ్డారు. ఈ వేలంలో హిందూపురానికి చెందిన కాంట్రాక్టర్ రూ. 19 కోట్ల 8 వేలకు కాంట్రాక్ట్ను దక్కించుకున్నాడు. గతంలో రూ. 9 కోట్ల ఒక లక్షకు టెండర్ జరిగింది. ప్రస్తుతం తలనీలాల సేకరణకు రికార్డు స్థాయిలో ధర రావడం వల్ల ఆలయ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.