వేములవాడ టౌన్, ఏప్రిల్ 11: రాజన్న గుడి చెరువు బండ్ సుందరీకరణ పనులను సత్వరం ప్రారంభించాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు అధికారులకు సూచించారు. మంగళవారం హైదరాబాద్లోని వీటీడీఏ కార్యాలయంలో వీటీడీఏ, రాజన్న ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చెరువు అభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేసిన రూ.12 కోట్లతో స్నాన ఘట్టాలు, బండ్ వెడల్పు, పచ్చదనం పెంపు తదితర పనులు చేపట్టాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. రూ.18.50 కోట్ల తో సేకరించిన ఎకరం స్థలంలో బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులు చేపట్టాలని, రూ.10 కోట్లతో బోనాల మండపం, షాపింగ్ కాంప్లెక్స్ పనులను ప్రారంభించాల ని కోరారు. సమావేశంలో వీటీడీఏ వైస్చైర్మన్ పురుషోత్తంరెడ్డి, పర్యాటక శాఖ ఎండీ మనోహర్రావు, రాజన్న ఆలయ ఈవో కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.