మెండోరా/ ఏర్గట్ల, మే 15: జ్వర సర్వేను పకడ్బందీగా చేపట్టాలని రోడ్డు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ముప్కాల్తోపాటు మెండోరా మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి యోగాక్షేమాలు తెలుసుకొన్నారు. కొవిడ్ వచ్చిన వారిని ఐసొలేషన్లో ఉంచాలని సూచించారు. ఐసొలేషన్ కేంద్రాలుగా పాఠశాలలను ఉపయోగించుకోవాలని స్థానిక తాసిల్దార్, ఎంపీడీవోకు సూచించారు.