హైదరాబాద్ : రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధృవీకరణ అథారిటీ ఏజెన్సీ బోర్డు మెంబర్గా వేల్పూర్ సంజీవ్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ సంబంధిత శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వేల్పూర్ సంజీవ్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలంలోని దొనకల్ గ్రామానికి చెందిన వ్యక్తి.
రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ మెంబర్ గా తన నియామకానికి సహకరించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ,వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి వేల్పూర్ సంజీవ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రోత్సాహంతో తాను చేపట్టే పదవికి వన్నె తీసుకువస్తానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.