నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని వేదం పాఠశాల యాజమాన్యం చిన్నారుల కోసం మంగళవారం ఎలక్ట్రిక్ ట్రైన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రైలులో విద్యార్థులను పట్టణంలోని పలు ప్రాంతాల్లో తిప్పడంతో చిన్నారులు సంబురపడ్డారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు చదువుతోపాటు ఆహ్లాదాన్ని పంచేందుకు ఈ ట్రైన్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ప్రిన్సిపాల్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. – భైంసా