బాసర, సెప్టెంబర్ 29: బాసర ట్రిపుల్ ఐటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు రూ.15 లక్షల వేతనంతో ఉద్యోగాలు సాధించినట్టు వీసీ వెంకటరమణ తెలిపారు. కంప్యూటర్ సైన్స్ నాలుగో సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాలు సాధించినట్టు పేర్కొన్నారు. ‘హుగో సేవ్’ అనే కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూలో మహ్మద్ అమ్రత్, కెమెర ప్రణవ్ మంచి ప్యాకేజీ సాధించారు.
నిరుపేద కుటుంబంలో పుట్టి, ఎంతో ప్రతిభతో ఉద్యోగాలు సాధించడంపై డైరెక్టర్ సతీశ్ కుమార్ వారిని అభినందించారు. మహ్మద్ అమ్రత్ నిజామాబాద్ జిల్లా వాసి కాగా, తండ్రి మటన్ షాపు నిర్వాహకుడు, తల్లి గృహిణి. కెమెరా ప్రణవ్ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని వాసి కాగా, తల్లిదండ్రుల కూలీ పనులు చేస్తారు.