TS Minister Jagadish Reddy | సూర్యాపేట జిల్లాలో వివిధ రాజకీయ పార్టీల నుంచి అధికార బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. ఆత్మకూరు మండలం తుమ్మల పెన్ పహడ్ గ్రామ సీపీఎం వార్డు సభ్యుడు పల్లపు యాదమ్మ, మల్లయ్యలతో పాటు 20 మంది బిజెపి, కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో గురువయ్య, ఎల్లయ్య, దయాకర్ , సుధాకర్, లలిత, శ్రీలత, సుజాత, ఉమ, నాగరాజు, శ్రీను తదతరులు ఉన్నారు.
వీరందరికీ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి గులాబీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వెంకట నారాయణ గౌడ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తుడి నరసింహారావు, ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రసాద్, ఎంపీపీ మర్ల చంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.