నాగలి వేసి.. నేలను చీల్చి.. నారును మోసి.. నాటును వేసి.. కలుపును తొలిచి.. పంటను పెంచి.. పైరుకు ప్రేమను ధారగా పోసి..
వడ్లను తీసి.. ఎండిన గడ్డిని ఎరువునుచేసి.. మళ్లీ నాగలిపట్టే రైతును మించిన దేవుడు ఏడి? పొలమును మించిన ఆలయమేది?
పంటకు పెట్టుబడి మొదలు.. సాగుచేసిన
పంటకు పుష్కలంగా నీరందించేదాకా..
అన్నదాతలకు అన్ని వేళలా అవసరమైన అండదండలిచ్చిన
ప్రభుత్వ పాలనలో.. రాష్ట్రంలో బంగారు పంటలు పండాయి..
ధాన్యపు రాశులతో పల్లెలు కళకళలాడుతున్నాయి!
నాటి కరువు నేలలో.. నేడు పసిడి కాంతులు
మండుటెండల్లో.. తాపాన్ని సైతం లెక్కచేయకుండా.. కల్లాల్లోంచి గడ్డిమోపులను తరలిస్తున్న మహిళారైతులు వీరు.. తెలంగాణలో ఎవుసాన్ని బంగారంచేసిన అన్నదాతలు. ఏడేండ్ల క్రితం తెలంగాణలో సేద్యం ఇలా అవుతుందని అనుకొంటిమా! ఇప్పుడు చూస్తున్న
ఈ దృశ్యం.. నిన్నటి కరువు ప్రాంతం.. నేడు బంగారు వర్ణంలో ధాన్య రాశులు మెరిసిపోతున్న జనగామ జిల్లా మాణిక్యాపురం అందాలను చూడటానికి ఎన్ని కన్నులు మాత్రం ఏం చాలుతాయి? కనులకందని ఆ సుందర దృశ్యాన్ని నమస్తే తెలంగాణ క్లిక్మనిపించింది!