వనస్థలిపురం, సెప్టెంబర్ 26: జాతీయ హార్టికల్చర్ బోర్డు డైరెక్టర్గా వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీకి చెందిన వనిపల్లి శ్రీనివాస్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ పదివిలో మూడేండ్లపాటు కొనసాగ నున్నారు. దేశవ్యాప్తంగా ఎనిమిది మందిని ఎంపిక చేయగా రాష్ట్రం నుంచి శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లకు చెందిన శ్రీనివాసరెడ్డి దేశంలోనే తొలిసారి డ్రాగన్ఫ్రూట్ను సాగుచేసి విప్లవం సృష్టించారు.
తక్కువ నీటితో ఎక్కువ పంటను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించారు. వేలమంది రైతులకు సలహాలు, సూచనలు ఇస్తూ 15 వేల ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ను పండించే స్థాయికి తీసుకెళ్లారు. వ్యవసాయ రంగానికి చేస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం గతంలో ఉత్తమ రైతుగా ఎంపిక చేసింది. కేంద్ర ప్రభుత్వం తనకు అప్పగించిన పనిని బాధ్యతగా నిర్వర్తిస్తానని శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. జాతీయ హార్టికల్చర్ బోర్డు డైరెక్టర్గా నియమితులైన శ్రీనివాస్రెడ్డికి రైతు నాయకులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.