కాజీపేట, సెప్టెంబర్ 23: దళితులు ఆత్మగౌరవంతో జీవిస్తూ ఆర్థికాభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని టీఎస్ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కాజీపేటలో నిర్వహించిన టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్రస్థాయి సదస్సులో మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు నిండినా దళితుల జీవితాల్లో చీకటి అలాగే ఉన్నదన్నారు. దళితులు స్వావలంబన దిశగా నడపడానికి సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు.