వనపర్తి : వనపర్తి కిరీటంలో మరో మరో కలికితురాయి చేరింది. జిల్లా విద్యా హబ్గా మారుతున్నది. వనపర్తి ప్రాంతంలో విద్యా ప్రాముఖ్యాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల్లో వనపర్తికి మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలు ఇస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. వనపర్తికి ప్రభుత్వ జేఎన్ టీయూ ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు అయింది. ఈ మేరు ఉన్నత విద్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తాత్కాలికంగా పాలిటెక్నిక్ కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతుల ప్రారంభం కానున్నాయి. రెగ్యులర్ క్యాంపస్ నిర్మాణం అనంతరం ఇక్కడి నుంచి ఇంజినీరింగ్ కాలేజీని తరలించనున్నారు. ఇప్పటికే మెడికల్ కళాశాలకు కేటాయించిన స్థలం సమీపంలో ఇంజినీరింగ్ కళాశాలకు 25 ఎకరాలు కేటాయించారు.
మత్స్య కళాశాల, మెడికల్ కళాశాలకు తోడు ఇంజినీరింగ్ కళాశాల రాకతో ఇక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.