హైదరాబాద్, అక్టోబరు 28 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్చార్జి కల్వకుంట్ల వంశీధరరావు పుట్టినరోజు వేడుకలను ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతా ల్లో ఘనంగా నిర్వహించారు. ఫాల్ఘర్ జిల్లా లో పాఠశాలల విద్యార్థులకు బిసెట్లు, చా క్లెట్లు పంచారు.
అఖిలభారత ఆదివాసీ ఏక్తా ఫౌండేషన్ తరఫున సాగర్ జైన్ ఆశ్రమ విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ జిల్లా సమన్వయకర్త రాహుల్ థాకరే, సహ సమన్వయకర్త శశికాంత్ తివారీ, డహాణు తాలూకా సర్పంచ్, పరిషత్ అధ్యక్షుడు కిషోర్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు.