DJU | దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీని నియమించింది. తెలంగాణ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడిగా రాణా ప్రతాప్, ప్రధాన కార్యదర్శిగా రావికంటి శ్రీనివాస్ లను డబ్ల్యూజేఐ అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శి నరేంద్ర బండారీ, అధ్యక్షులు సంజయ్ ఉపాధ్యాయ నియమించారు. జాతీయస్థాయిలో భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్)కు అనుబంధంగా ఏర్పాటై పాత్రికేయుల సంక్షేమం కోసం కృషిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) రాష్ట్ర కమిటీని పూర్తిగా శ్రీనివాస్కు అప్పగిస్తూ సమావేశం నిర్ణయించింది.
రాష్ట్ర సంఘం గౌరవాధ్యక్షులుగా ప్రముఖ పాత్రికేయులు వల్లీశ్వర్, సలహాదారుగా సలహాదారుగా ఎస్ బి రవింద్ర రాజు వర్మ, డాక్టర్ పి మురళీమనోహర్, నందనం కృపాకర్ నియమిస్తూ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ ఓ ప్రకటన చేశారు. ఉపాధ్యక్షులుగా ఆవునూరి సాయికృష్ణ, సతీష్ కుమార్, బీరప్ప, దేవిక, ఎన్.అనిల్ రావు, , వీఎం ప్రసాద్, కార్యదర్శులుగా చింతల క్రాంతి ముదిరాజ్, నారాయణ్
ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.చంద్రన్న, జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా శివాజీ, కోశాధికారిగా హనుమాన్
కార్యాలయ కార్యదర్శిగా ప్రసాద్ నియమితులయ్యారు.
ఇక సంఘం లీగల్ సెల్ బాధ్యుడిగా ఎన్. రామచంద్రరావు, ఎడ్ల రవి, టెక్నికల్ సెల్ సభ్యులుగా శ్రీకాంత్ లను నియమించినట్లు రావికంటి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడతామని , వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు ప్రకటించారు. ఈ కమిటీ నియామకానికి సహకరించి పెద్దలకు, జాతీయ కమిటీకి రావికంటి శ్రీనివాస్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.