హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి విద్య, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పాడి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. బుధవారం యూకేకు చెందిన చిచెస్టర్ యూనివర్సిటీ ప్రతినిధులతో హైదరాబాద్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య సహకారం, ఉన్నత విద్య అవకాశాలపై విసృ్తతంగా చర్చించారు.
తెలంగాణ రాష్ట్రం, చిచెస్టర్ విశ్వవిద్యాలయం మధ్య విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకార అవకాశాలను పరిశీలించారు. సమావేశంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, చిచెస్టర్ విశ్వవిద్యాలయ ప్రతినిధి ఒలివియా మెక్ లాగ్లిన్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.