హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి భక్తులకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. పదిరోజులకు సంబంధించిన సర్వదర్శనం టికెట్లు తిరుపతిలోనే జారీ చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
జనవరి 1న సర్వదర్శనం టికెట్లు ప్రారంభమవుతాయని, టికెట్లు పూర్తయ్యే దాకా తిరుపతిలో కౌంటర్లు తెరచి ఉంటాయన్నారు. వైకుంఠద్వార దర్శనానికి సంబంధించి రోజుకు 25 వేల చొప్పున 2.5 లక్షల రూ.300 దర్శనం టిక్కెట్లు ఆన్లైన్లో కేటాయిస్తామన్నారు.