Medak | మెదక్ : మెదక్ పట్టణంలోని రామాలయం, వెంకటేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి(వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం) వేడుకలు వైభవంగా జరిగాయి. పల్లకి సేవ, ఆరాధన, కోలాటం వంటి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి దంపతులు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారామ స్వామి వారిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సతీసమేతంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డిరిని రామాలయ కమిటీ సాదరంగా ఆహ్వానించింది. ఎమ్మెల్సీ దంపతులను కమిటీ సభ్యులు సన్మానించి జ్ఞాపికలు, తీర్థ ప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాలలో మున్సిపల్ చైర్ పర్సన్ తొడుపునూరి చంద్రపాల్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్లు మధుసూదన్ రావు, గాయత్రి గౌడ్, రాగి వనజ, కృష్ణ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్లు మహిపాల్ రెడ్డి, శీను నాయక్, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.