నమస్తే తెలంగాణ నెట్వర్క్: సమాజంలో వెనుకబడి, వివక్షకు గురైన తమ అభ్యున్నతికి ‘దళిత బంధు’ పథకాన్ని తెచ్చిన సీఎం కేసీఆర్ను దళిత నేతలు కొనియాడారు. పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడంతోపాటు గురువారం జీవోను జారీచేయడం పట్ల సంబురాలు అంబరాన్నంటాయి. దళిత బాంధవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఖమ్మ జిల్లా కల్లూరులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో, రఘునాథపాలెం మండలం కోయచలక ఎస్సీవాడలో, వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.