కొవిన్ పోర్టల్లో మార్పులే కారణం
సోమవారం నుంచి పునఃప్రారంభం
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్టు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య గడువును 12-16 వారాలకు పెంచడం, కొవిన్ పోర్టల్లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మార్పులు.. తదితర కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 45 ఏండ్లకు పైబడినవారికి అందజేస్తున్న వ్యాక్సిన్ కార్యక్రమం సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందని చెప్పారు.