హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణే లక్ష్యంగా పశు సంవర్ధకశాఖ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ను చేపడుతున్నది. తొలిదశలో మార్చి 1 నుంచి 12 జిల్లాల్లో ప్రారంభిస్తుండగా మార్చి 15 నుంచి మిగతా జిల్లాల్లోనూ నిర్వహించనున్నట్టు డైరెక్టర్ జీ మంజువాణి తెలిపారు.
అవసరమైన వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రస్తుతం 14.44 లక్షల డోసుల వ్యాక్సిన్ సరఫరా చేసిందని, మరో 38.89 లక్షల డోసుల వ్యాక్సిన్ 15 రోజుల్లో సరఫరా చేయనున్నదని వివరించారు.