హైదరాబాద్ : రాచకొండ పోలీస్ కమిషనరేట్లోని ఎల్బీ నగర్ జోన్ పోలీసు సిబ్బంది కుటుంబాలకు టీకా డ్రైవ్ను ఎల్బీ నగర్లోని ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్లో శుక్రవారం ప్రారంభించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఈ కేంద్రాన్ని సందర్శించి పోలీసు సిబ్బంది, వైద్యులు, పారామెడిక్స్ కుటుంబాలతో మాట్లాడారు. 12 వేల మంది పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు టీకాలు వేసే అవకాశం ఉందని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. డీసీపీ (ట్రాఫిక్) శ్రీనివాస్, ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్, ఇతర సీనియర్ పోలీసు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీకా డ్రైవ్ను సులభతరం చేసినందుకు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, యాదాద్రి-భువనగిరి జిల్లాల డీఎంహెచ్ఓలకు సీపీ మహేశ్ భగవత్ కృతజ్ఞతలు తెలిపారు.