ITDA | ఆదిలాబాద్ : ఉట్నూర్ ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావు మంగళవారం మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న లక్కేరావు హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావు హఠాన్మరణం పట్ల అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లక్కేరావు గిరిజనుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. లక్కేరావు మృతి గిరిజన జాతికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రార్థించారు.