సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్(Hyderabad) మహానగరంలో వారసత్వ కట్టడాల్లో ఒకటైన కుతుబ్షాహీ టూంబ్స్(Qutub Shahi Tombs)ను యూఎస్ కాన్సులేట్(US Consulate), ఆగా ఖాన్ ఫౌండేషన్(Aga Khan Foundation) ప్రతినిధుల బృందం మంగళవారం సందర్శించారు. చారిత్రాత్మక వారస్వత కట్టడం పరిరక్షణ కోసం యూఎస్ ఎంబాసిడర్స్ ఫండ్ను ఆగా ఖాన్ ట్రస్ట్తో కలిసి వెచ్చించిందని ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ప్రాజెక్టు డైరెక్టర్ యశోవంత్ పురోహిత్ తెలిపారు. నగరంలో అత్యంత అందమైన కట్టడాల్లో ఒకటైన టూంబ్స్ పరిరక్షణలో భాగస్వాములైనందుకు సంతోషంగా ఉందన్నారు.